కోరిక తీర్చలేదని ఒక వ్యక్తి మరో వ్యక్తిపై దాడి...

కోరిక తీర్చలేదని ఒక వ్యక్తి మరో వ్యక్తిపై దాడి...
x
Highlights

కోరిక తీర్చలేదని ఒక వ్యక్తి మరో వ్యక్తిపై దాడికి దిగిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం...

కోరిక తీర్చలేదని ఒక వ్యక్తి మరో వ్యక్తిపై దాడికి దిగిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం బాన్సువాడ గ్రామానికి చెందిన సాయులు,రమేష్ అనే ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న సాయిలు రమేష్ ని గ్రామ శివారులో ఉన్న పత్తి చేనులోకి తీసుకువెళ్ళి లైంగిక కోరిక తీర్చాలని కోరాడు.

దానికి రమేష్ ఒప్పుకోకపోవడంతో అతడిపైకి సాయిలు దాడికి దిగాడు. అతడి దుస్తులను చింపుతూ , ముఖంపై కొరుకుతూ గాట్లు పెట్టాడు. అక్కడినుండి రమేష్ తప్పించుకొని ఇంటికి వచ్చేసాడు. విషయం తల్లితండ్రులకి చెప్పడంతో ఊళ్ళో పెద్దలతో మాట్లాడి సాయిలును పోలీసులకి అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సాయిలుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.అతడు పెట్టె బాధలు భరించలేక భార్య వేరుగా ఉంటుంది. మద్యానికి బానిసై రమేష్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇక రమేష్ కు పెళ్లయింది. మతిస్థిమితం సరిగా లేకపోవడంతో అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories