డ్యామిట్ కథ అడ్డం తిరిగింది : భార్యను చంపబోయి అడ్డంగా దొరికాడు ..

డ్యామిట్ కథ అడ్డం తిరిగింది : భార్యను చంపబోయి అడ్డంగా దొరికాడు ..
x
Highlights

అతనికి పెళ్లైంది .. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు . అడ్డంగా ఉన్న భార్యను అడ్డు తోలిగించుకోవాలని చూసి అడ్డంగా బుక్కయ్యాడు ..

అతనికి పెళ్లైంది .. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు . అడ్డంగా ఉన్న భార్యను అడ్డు తోలిగించుకోవాలని చూసి అడ్డంగా బుక్కయ్యాడు ..ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది . ఇక వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లాలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన బత్తుల కళ్యాణ్ , అరుణలకు 8 సంవత్సరాల క్రితం వివాహం అయింది . వీరికి ఇద్దరు పిల్లలు .. ఈ క్రమంలోనే కళ్యాణ్ కి రమాదేవితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధం ఏర్పడింది . అయితే వీరి వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉందని తన భార్యను చంపేందుకు స్కెచ్ వేసాడు కళ్యాణ్ ..

ఈ క్రమంలోనే అనుకున్నా ప్లాన్ ప్రకారం సాగర్ మాత ఆలయంలో నిద్ర చేయాల్సివుందని తన భార్యను రమాదేవి స్నేహితుడు, ఆటో డ్రైవర్ సందీప్ తో కలిసి సాగర్ మాత ఆలయానికి చేరుకున్నారు.అర్ధరాత్రి వేళలో బొయ్యారం ప్రాంతంలో అరుణని బ్రిడ్జిపై నుంచి నీళ్లల్లోకి నెట్టేశారు. ఇక ఆమె చనిపోయింది కావచ్చు అనుకోని అక్కడినుండి వెళ్ళిపోయారు . కానీ అదృష్టవశాత్తు నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో అరుణ కాల్వలో కార్లను కడిగే ప్రదేశానికి చేరుకుంది . అ తర్వాత తన బంధువులకు మరియు పోలీసులకు ఫోన్ చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories