దారుణం : కన్నతండ్రే కన్న కొడుకును చంపేశాడు

దారుణం : కన్నతండ్రే కన్న కొడుకును చంపేశాడు
x
Highlights

తండ్రే కొడుకు గొంతు పిసికి చంపి పైగా నేరం బయటపడకుండా మృతదేహాన్ని తన పొలంలో బోరు బావి వద్ద పాతిపెట్టాడు. మూడు రోజులపాటు నిజాన్ని దాచిపెట్టి అందరితో...

తండ్రే కొడుకు గొంతు పిసికి చంపి పైగా నేరం బయటపడకుండా మృతదేహాన్ని తన పొలంలో బోరు బావి వద్ద పాతిపెట్టాడు. మూడు రోజులపాటు నిజాన్ని దాచిపెట్టి అందరితో కలిసి తిరిగాడు. తన కొడుకు కనిపించడం లేదంటూ నాటకాలాడాడు. ఎట్టకేలకు తనకు తనకు తానే పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఉదంతం చుట్టుపక్కల ప్రాంతల ప్రజలను ఉలిక్కి పడేలా చేసింది.

మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ నారాయణరెడ్డి కుమారుడు శ్రావణ్ కుమార్‌రెడ్డి బీటెక్ మధ్యలో ఆపివేశాడు. ఇంటి వద్దనే ఉంటున్నాడు. తండ్రి కొడుకులు ఇద్దరికి అస్సలు పడేది కాదు. నిత్యం కుమారుడితో నారాయణరెడ్డి గొడవ పడేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. దసరాకు ఒకరోజు ముందు గ్రామంలో జరిగిన దుర్గాభవానీ శోభాయాత్రలో పాల్గొన్న శ్రవణ్.... తన మద్యం తాగి ఇంటికి చేరుకున్నాడు. అంతకుముందున్న గొడవను దృష్టిలో పెట్టుకొని నారాయణరెడ్డి ఉరేసి చంపేశాడని గ్రామస్తులు చెబుతున్నారు.

ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని ఇంటి పక్కనే ఉన్న తన వ్యవసాయ బోరు పక్కన పాతి పెట్టాడు నారాయణరెడ్డి. అప్పటి వరకు గ్రామస్తులతో కలిసిమెలిసి తిరుగుతూ తన కొడుకు కనబడలేదని ప్రచారం చేశాడు. ఎక్కడైనా కనిపిస్తే చెప్పమంటూ అందరినీ వేడుకున్నాడు. బతుకమ్మ పండుగకు పుట్టింటికి వెళ్లి తిరిగివచ్చిన శ్రవణ్ తల్లి, భర్తను నారాయణరెడ్డి నిలదీయడం గ్రామస్తులు కూడా అనుమానించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు సంగతి బయటపడింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories