ఏడేళ్ల బాలికపై అత్యాచారం...పరిస్థితి విషమం

ఏడేళ్ల బాలికపై అత్యాచారం...పరిస్థితి విషమం
x
Highlights

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. రెంటచింత మండలం తుమృకోటలో ఏడేళ్ల బాలికపై జయరాజ్‌ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బహిర్భూమికి వెళ్లిన బాలికపై...

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. రెంటచింత మండలం తుమృకోటలో ఏడేళ్ల బాలికపై జయరాజ్‌ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బహిర్భూమికి వెళ్లిన బాలికపై మద్యం మత్తులో ఉన్న జయరాజ్‌ అత్యాచారం చేశాడు. బాలిక కేకలు వేయడంతో నిందితుడు జయరాజ్ అక్కడి నుంచి పరారయ్యాడు.

విషయం తెలుసుకున్న గ్రామస్థులు బాధితురాలిని గుంటూరు జీజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాలికపై లైంగిక దాడి చేసిన నిందితుడిని అరెస్ట్‌ చేయాలంటూ బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు. మాచర్ల రహదారిపై ధర్నా నిర్వహించారు.

గుంటూరు జిల్లాలో రేప్‌ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్‌లతో మాట్లాడారు. లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు జిల్లా ఎస్పీ సీఎంకు తెలిపారు. మాచర్ల రహదారిపై బాధితుల ఆందోళనపై ఆరా తీసిన సీఎం వెంటనే పరిస్థితిని అదుపు చేయాలని, లైంగిక దాడి నిందితుడిపై కఠిన చట్టాలు అమలు చేయాలని ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories