పెళ్లి వేడుకల్లో చిన్నారి కిడ్నాప్, హత్య.. ఆ చిన్నారిని చంపిందెవరు..?

పెళ్లి వేడుకల్లో చిన్నారి కిడ్నాప్, హత్య.. ఆ చిన్నారిని చంపిందెవరు..?
x
Highlights

చిత్తూరు జిల్లాలో ఓ చిన్నారి దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టిస్తోంది. బంధువుల పెళ్లికి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన 8 ఏళ్ల బాలికను అర్ధరాత్రి కళ్యాణ మండపం...

చిత్తూరు జిల్లాలో ఓ చిన్నారి దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టిస్తోంది. బంధువుల పెళ్లికి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన 8 ఏళ్ల బాలికను అర్ధరాత్రి కళ్యాణ మండపం వద్ద కిడ్నాప్ కు గురైంది తెల్లవారుజామున చిన్నారి మృతదేహం కళ్యాణ మండపం వెనుకవైపు పడి ఉంది.

చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గట్టు గ్రామానికి చెందిన సిద్దారెడ్డి, ఉషారాణి దంపతులకు ముగ్గురు కూతుళ్లు. బంధువుల పెళ్లి కోసం కురబలకోట మండలం అంగల్లులోని NNR కల్యాణ మండపానికి వచ్చారు. అర్ధరాత్రి 12 గంటలకు సిద్ధారెడ్డి చివరి కూతురు 8 ఏళ్ల వర్షిణిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ తెల్లవారుజామున వర్షిణి డెడ్ బాడీ కల్యాణ మండపం వెనుకవైపు పడి ఉంది. విగతజీవిగా పడి ఉన్న వర్షిణిని చూసి తల్లిదండ్రులు, బంధువులు షాక్ తిన్నారు. అభం శుభం తెలియని పాపను పొట్టన పెట్టుకున్నారని కన్నీరుమున్నీరుగా రోధించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

వర్షిణి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. NNR కల్యాణ మండపంలో సీసీ టీవీ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. వర్షిణి హత్యకు పాతకక్షలు కారణంగా భావిస్తున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories