ఘోరం..అనంతపురం జిల్లా లో 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం!

ఘోరం..అనంతపురం జిల్లా లో 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం!
x
Highlights

మద్యం మత్తులో మదమెక్కిన కామంతో 3 ఏళ్ల చిన్నారి జీవితాన్ని బుగ్గిపాలు చేసాడు ఓ మృగాడు. అనంతపురం నగర శివారులో ఉన్న ఎర్రనేల కొట్టాల్లో ఈరోజు 3 ఏళ్ల ...

మద్యం మత్తులో మదమెక్కిన కామంతో 3 ఏళ్ల చిన్నారి జీవితాన్ని బుగ్గిపాలు చేసాడు ఓ మృగాడు. అనంతపురం నగర శివారులో ఉన్న ఎర్రనేల కొట్టాల్లో ఈరోజు 3 ఏళ్ల చిన్నారిపై దారుణం చోటు చేసుకుంది. 40 ఏళ్ల వయసున్న కిరణ్ అనే కామాంధుడు ఈ కిరాతకానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే.....

అనంతపురం జిల్లా నగరాశివారులోని ఎర్రనేల కొట్టాల్లో కాపురముంటున్న ఓ కుటుంబానికి చెందిన 3 ఏళ్ల చిన్నారికి చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి తనతో తీసుకు వెళ్ళాడు కిరణ్ అనే కామాంధుడు. చిన్నారి తనది ఆటోడ్రైవర్. తల్లి ఓ హాస్పటల్లో పని చేస్తుంది. వీరికి పనులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అవుతుంటుంది. పాపను ఆ సమయంలో పక్కింట్లో వదిలి వెళతారు. ఎప్పటిలానే ఈరోజు కూడా వాళ్ళు పాపని పక్కింట్లో వదిలి వెళ్లారు. ఈ సమయంలో పాప ఆడుకుతూ బయటకు వచ్చింది. ఇదే అదనుగా ఫూటుగా తాగి మత్తులో ఉన్న కిరణ్ చిన్నారిని బయటకు తీసుకువెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సాయంత్రం పాపా తల్లి ఇంటికి వచ్చేసరికి ఏడుస్తున్న ఆ పాపను ఎత్తుకుని కిరణ్ బుజ్జగిస్తున్నాడు. పాప ఎందుకు ఏడుస్తోందని ఆరా తీయగా.. తీవ్రంగా రక్తస్రావం అవుతుండడం కనిపించింది. దీంతో విషయాన్ని గ్రహించిన ఆమె పాపను ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకువెళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని ఫోక్సో చట్టం తో సహా, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారాన్ జరుపుతున్నారు. ఈ సంఘటన తెల్సిన ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు నిందితుడ్ని ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories