
బీజేపీతో దోస్తీకి జగన్ సై అంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని స్పష్టం చేశారు. CNN న్యూస్కు ప్రత్యేక ఇంటర్వ్యూ...
బీజేపీతో దోస్తీకి జగన్ సై అంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని స్పష్టం చేశారు. CNN న్యూస్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన జగన్.. బీజేపీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇస్తే బేషరతుగా బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ చేపట్టిన పాదయాత్ర 900 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నేషనల్ మీడియాతో మాట్లాడిన జగన్.. రాష్ట్రాభివృద్ధి, రాజకీయ అంశాలపై పార్టీ పంథాను వివరించారు. 2019 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాకపోతే తనకు ముందుగా బీజేపీ ప్రత్యేక హోదా హామీ ఇస్తే ఇతర ఆలోచన లేకుండా బీజేపీతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు.
ప్రత్యేక హోదా ఎవరిస్తే వారితో జత కట్టడానికి వైసీపీ సిద్ధంగా ఉన్నట్లు ఎప్పుడో చెప్పామని hmtvలో జరిగిన డిబేట్లో ఆ పార్టీ ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. బీజేపీతో కలవడానికి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలో తప్పు లేదన్నారు. బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి, ప్రధాని ప్రత్యేక హోదా ఇవ్వగలరని అన్నారు.
మరోవైపు గతంలో నేషనల్ మీడియా కొన్ని కథనాల్ని ప్రసారం చేసింది. బీజేపీ తో కలిసి పనిచేసేందుకు జగన్ అధిష్టానంతో సంప్రదింలు జరిపారని గగ్గొలు పెట్టింది. అంతకు ముందు పలు అంశాల్లో బీజేపీ కి వైసీపీ మద్దతు ఇచ్చేందుకు ఏమాంత్రం వెనుకాడలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో బేషరతు మద్దతు! ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ అదే మద్దతు! ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయకుండా... రాష్ట్ర ప్రభుత్వంపై రుసరుసలు! దీంతో పేరుకే ప్రతిపక్షమైనా కేంద్రంతో సన్నిహితంగా మెలుగుతుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఇదిలా ఉంటే ఆర్ణబ్ గోస్వామి రిపబ్లికన్ టీవీలో జగన్ వార్తను హైలెట్ చేస్తూ జగన్ బీజేపీతో చేతులు కలిపిందేకు అంతా సిద్ధం. అందుకు వైసీపీ కి మధ్య వర్తిగా గాలిజనార్ధన్ రెడ్డి బీజేపీకి చెందిన ముగ్గురు పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారని, ఆచర్చలు సఫలమై వచ్చే ఎన్నికల్లో బీజేపీ - వైసీపీ కలిసి పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తేటతెల్లమైంది. ఇక వైసీపీ తో కలిసి పనిచేయాలా..టీడీపీ తో కొనసాగాలా అన్న విషయాలపై ఆరాతీసిన బీజేపీ పార్టీ ప్రయోజనాల లక్ష్యంగా నిర్ధేశించుకుంటూ వచ్చే ఎన్నికల్లోపు తేల్చేస్తుందని చెప్పారు. బీజేపీ అధిష్ఠానం నుంచి ఇలాంటి సంకేతాలు వెలువడిన మరుసటి రోజే.. ‘ఎన్డీయేలోకి జగన్’ అంటూ రిపబ్లిక్ టీవీ పేర్కొనడం విశేషం.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2023. All rights reserved.
Powered By Hocalwire