సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఫైర్

nanireddy
Updated on: 24 Dec 2018 2:57 PM IST
సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఫైర్
X

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి ఫైర్ అయ్యారు. నగరి నియోజకవర్గం కల్లూరులో పర్యటించిన రోజా.. 'రావాలి జగన్, కావలి జగన్' కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే వైసీపీ అధికారంలోకి వస్తే నవరత్నాలను అమలుచేస్తామని ప్రజలకు వివరించారు. ఈ సందర్బంగా రోజా మాట్లాడుతూ.. నిత్యం ప్రజలను మోసం చేస్తూ అధికార దుర్వినియోగంతో చంద్రబాబు ప్రజల జీవితాల్లో చీకట్లు నింపారని ఆరోపించారు. కుమారుడు లోకేష్ ఆస్తులు పెంచుకుంటూ.. రాష్ట్రాన్ని 2.50 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని ఆమె విమర్శించారు.

nanireddy

nanireddy

Next Story