తాము అధికారంలోకి వస్తే ఆ నాలుగు కుటుంబాలకు...

nanireddy
Updated on: 24 Dec 2018 1:30 PM IST
తాము అధికారంలోకి వస్తే ఆ నాలుగు కుటుంబాలకు...
X

నాలుగు ప్రధాన అర్చకుల కుటుంబాలపై టీటీడి తీసుకున్న నిర్ణయం దారుణమని వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ విశ్వాసాలపై దెబ్బ కొట్టి బౌద్దాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రెండేళ్ళ కాలపరిమితి కూడా ఖచ్చితంగా ఉంటుందో లేదో తెలియని పాలక మండలి, 2వేల ఏళ్ల క్రితం నుంచి ఉన్న సాంప్రదాయ వ్యవస్థపై ఉన్నట్లుండి ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రశ్నించినందుకే రమణదీక్షితులతో పాటు నాలుగు కుటుంబాలను ఇబ్బందులు కలిగిస్తున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఆ నాలుగు కుటుంబాలకు... సమున్నత స్థానంలో నిలబెడతామన్నారు.

nanireddy

nanireddy

Next Story