వారిని చూడాలని కోరుకుంటున్న మాధవి

nanireddy
Updated on: 24 Dec 2018 2:58 PM IST
వారిని చూడాలని కోరుకుంటున్న మాధవి
X

ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా తండ్రిలో చేతిలో పాశవికంగా దాడికి గురైన మాధవి ప్రస్తుతం క్షేమంగా ఉందని వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నా క్రమంగా కోలుకుంటోందని అన్నారు. కాగా మాధవి తన తల్లి, తమ్ముడిని చూడాలనుకుంటున్నట్టు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ తెలియజేశారు. కూతురు ప్రేమ వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న తండ్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎర్రగడ్డ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బోరబండకు చెందిన మాధవి, ఎర్రగడ్డకు చెందిన సందీప్‌లు నాలుగు రోజుల క్రితం ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు.

nanireddy

nanireddy

Next Story