ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను హతమార్చి ఆపై..

ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను హతమార్చి ఆపై..
x
Highlights

ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే ప్రియుడి సాయంతో హతమార్చిన భారతీయ సంతతి మహిళకు ఆమె ప్రియుడికి మెల్ బోర్న్ కోర్టు 22 ,27ఏళ్లపాటు జైలు శిక్ష...

ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే ప్రియుడి సాయంతో హతమార్చిన భారతీయ సంతతి మహిళకు ఆమె ప్రియుడికి మెల్ బోర్న్ కోర్టు 22 ,27ఏళ్లపాటు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన సోఫియాకు గుడియెట్టానికి చెందిన సామ్‌ అబ్రహంతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. కుటుంబంతో కలిసి అబ్రహం ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. అయితే చదువుకునే రోజుల్లోనే సోఫియాకు అరుణ్ కమల్ హాసన్ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడిచింది. అరుణ్‌కు కూడా మరో అమ్మాయితో పెళ్లైంది. అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అరుణ్‌ భార్యా పిల్లల్ని వదిలి పెట్టి 2013లో ఆస్ట్రేలియా వెళ్ళాడు. అక్కడ పెళ్లైన తర్వాత కూడా సోఫియా, అరుణ్‌లు చాటుమాటు ప్రేమ వ్యవహరం నడిపించారు. ఈ విషయం సోఫియా భర్తకు తెలిసి మందలించాడు. అయితే భర్తను అడ్డుతొలగించుకుంటే జీవితాంతం ఇద్దరు కలిసి ఉండొచ్చన్న ఆలోచనతో సోఫియా ప్రియుడితో కలిసి పథకం పన్ని తన భర్తకు జ్యూస్‌లో విషం కలిపి ఇచ్చింది. దీంతో అతను మృతిచెందాడు.కాగా అబ్రహం మృతిపై విచారణ జరిపిన పోలీసులు ఇద్దరిపై అభియోగం నమోదు చేశారు. నేరం రోజువు అవడంతో సోఫియాకు 22 ఏళ్ళు అరుణ కు 27 సంవత్సరాల జైలు శిక్ష విధించింది మెల్ బోర్న్ కోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories