ఆరుగురు మహిళలపై పెప్పర్‌ స్ప్రే చల్లి ఆపై..

nanireddy
Updated on: 24 Dec 2018 2:10 PM IST
ఆరుగురు మహిళలపై పెప్పర్‌ స్ప్రే చల్లి ఆపై..
X

హైదరాబాద్ లో నగరంలో సోమవారం తెల్లవారు జామున దారుణానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. మహిళలపై దాడికి యత్నించాడు. ఈ ఘటన పాతబస్తీలోని కాలాపత్తర్‌లో జరిగింది. కాలాపత్తర్‌ కు చెందిన మహ్మద్‌ యాసిన్‌ అనే యువకుడు కారులో వెళ్తున్న ఆరుగురు మహిళలపై పెప్పర్‌ స్ప్రేతో దాడి చేశాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ అనూహ్యంగా పారిపోతున్న నిందితున్ని కారు డ్రైవర్‌ స్థానికుల సాయంతో పట్టుకున్నాడు. దేహశుద్ధి చేసిన స్థానికులు యాసిన్‌ను పోలీసులకు అప్పగించారు. స్ప్రే కారణంగా అస్వస్థతకు గురైన ఇద్దరు మహిళలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అతను ఎందుకు ఈ దాడికి యత్నించాడో చెప్పడంలేదు. ఆకతాయిగా అతను ఈ పని చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story