బ్యుటీషియన్ పద్మ కేసు : నూతన్‌ భార్య సునీత ట్విస్ట్..

బ్యుటీషియన్ పద్మ కేసు : నూతన్‌ భార్య సునీత ట్విస్ట్..
x
Highlights

కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్‌ పద్మపై హత్యాయత్నం కేసు కీలక మలుపు తిరిగింది.. నిన్న సాయంత్రం నిందితుడిగా భావిస్తున్న నూతన్‌కుమార్‌...

కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్‌ పద్మపై హత్యాయత్నం కేసు కీలక మలుపు తిరిగింది.. నిన్న సాయంత్రం నిందితుడిగా భావిస్తున్న నూతన్‌కుమార్‌ బలవన్మరణానికి పాల్పడగా. అతడి కోసం 4 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలించారు. కాగా, ఆదివారం నరసరావుపేట-గుంటూరు మార్గంలోని రైలు పట్టాలపై నూతన్‌కుమార్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పద్మ ప్రియుడిగా భావిస్తున్న నూతన్ కుమార్ భార్య సునీతను పోలీసులు విచారించారు.ఆమె.. తన భర్త ఆత్మహత్య చేసుకోవడానికి పద్మనే కారణమని తెలిపింది. 2012లో తమ వివాహం జరిగిందని, తన భర్త నూతన్ ఓ ప్రైవేటు షోరూంలో మేనేజర్‌ గా పనిచేసేవారని.. ఆ సమయంలో తన భర్తతో పరిచయం పెంచుకుని పద్మ తన భర్తను లోబరుచుకుందని ఆరోపించారు. తన భర్తకు ఇష్టం లేకున్నా వేధింపులకు గురిచేసిందని, విడాకులు తీసుకోవాల్సిందిగా నూతన్‌ను పద్మ హింసించిందని సునీత తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories