పెళ్లి పేరుతో బ్లాక్ మెయిల్.. యువతి ఆత్మహత్య!

పెళ్లి పేరుతో బ్లాక్ మెయిల్.. యువతి ఆత్మహత్య!
x
Highlights

పెళ్లి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం మైసూర్ నగర పరిధిలోని విజయనగరంలో చోటుచేసుకుంది. విజయనగరంలో నివసించే ధన్యా(19)...

పెళ్లి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం మైసూర్ నగర పరిధిలోని విజయనగరంలో చోటుచేసుకుంది. విజయనగరంలో నివసించే ధన్యా(19) కి చిన్నప్పటి స్నేహితుడుడు దీనా(22) లు గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఆరునెలల కిందట వీరిమధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు విడిపోయారు. కానీ దీనా మాత్రం ఆమెను వేధింపులకు గురిచేయడం తనను పెళ్లిచేసుకోకపోతే చంపేస్తానని బెదిరించసాగాడు.. దీంతో భయాందోళనచెందిన యువతి తల్లిదండ్రులకు చెప్పింది. వారు దీనాను మందలించారు అయినా కూడా అతనిలో మార్పు రాలేదు ఈ క్రమంలో ధన్యాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇక ఈ పరిణామం దీనాకు రుచించలేదు పెళ్ళిచేసుకుంటే తనతో పాటు కుటుంబసభ్యులను అందరిని చంపేస్తానని ఆమెను బెదిరించాడు. దాంతో మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories