దేవుడు అడిగాడని కన్నకొడుకును బలిచ్చిన మహిళ!

దేవుడు అడిగాడని కన్నకొడుకును బలిచ్చిన మహిళ!
x
Highlights

దేవుడు అడిగాడని కన్న కొడుకును బలి ఇచ్చింది ఓ మహిళ.ఈ ఘటన ఇంగ్లాడ్ లో జరిగింది. ఇంగ్లండ్‌లోని వెస్ట్‌ యార్క్‌షైర్‌ లోని ఓ అపార్టుమెంటులో తల్లితోపాటు...

దేవుడు అడిగాడని కన్న కొడుకును బలి ఇచ్చింది ఓ మహిళ.ఈ ఘటన ఇంగ్లాడ్ లో జరిగింది. ఇంగ్లండ్‌లోని వెస్ట్‌ యార్క్‌షైర్‌ లోని ఓ అపార్టుమెంటులో తల్లితోపాటు జెమ్మా ప్రొక్టర్‌ ఆమె ముగ్గురు కుమారులు నివాసముంటున్నారు. జెమ్మా తన 16 ఏటనే మద్యానికి బానిసయ్యారు. పైగా 'పారానోయిడ్ స్కిజోఫ్రెనియా' అనే మానసిక వ్యాధితో బాధపడుతోంది. కొద్ది రోజులుగా దేవుడు తనతో మాట్లాడుతున్నాడని అందరితోనూ చెబుతోంది. ఈ క్రమంలో ఆమె 18 నెలల కొడుకును ఆమె తల్లి చూస్తుండగానే ఆరవ అంతస్థులోనుంచి విసిరి వేసింది. హతాశురాలైన తల్లి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా బండరాళ్ల మీద పడి బాలుడు మృతిచెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు జెమ్మాను విచారించగా ఆమె చెప్పిన మాటలతో పోలీసులు విస్తుపోయారు. గత కొద్ది రోజులుగా దేవుడు తనతో మాట్లాడుతున్నాడని దేవుడు అడిగితేనే తన కుమారుణ్ణి బలి ఇచ్చానని చెప్పింది. దీంతో ఆమెను మానసిక వ్యాధిగ్రస్తురాలిగా పరిగణించి అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories