భార్య బిడ్డను దారుణంగా హత్య చేసి ఆపై.. శవాలమధ్యే నిద్ర!

భార్య బిడ్డను దారుణంగా హత్య చేసి ఆపై.. శవాలమధ్యే నిద్ర!
x
Highlights

భార్యా కూతురిని దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి అనంతరం వారితో రాత్రంతా నిద్రించి.. అనూహ్యంగా తాను కూడా ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఈ ఘటన కర్ణాటక...

భార్యా కూతురిని దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి అనంతరం వారితో రాత్రంతా నిద్రించి..
అనూహ్యంగా తాను కూడా ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం మైసూర్ లో చోటుచేసుకుంది. మైసూర్ ప్రాంతానికి చెందిన ప్రజ్వల్, బెంగుళూరుకు చెందిన సవితను వివాహం చేసుకున్నాడు. పెళ్ళైన ఏడాది నుంచే భార్యా భర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. తరచు గొడవలు వస్తుండటంతో విసుగుచెందాడు ప్రజ్వల్. ఈ క్రమంలో ఎలాగైన భార్య,కూతురును చంపాలనుకున్నాడు. పెళ్లి రోజే ఈ దారుణానికి ప్లాన్ చేశాడు. గురువారం రాత్రి పెళ్లిరోజు వేడుక ముంగించుకున్నాక అందరూ నిద్రపోయారు.. ఆ సమయంలో కత్తితో భార్య సవిత, కుమార్తె సించనలను గొంతుకోసి చంపాడు. ఆ తరువాత భార్యాబిడ్డల శవాలతోనే రాత్రంతా నిద్రించాడు. పొద్దున్నే లేచి తన కుటుంబ సభ్యులకు ఈ ఘోరం గురించి తెలిపి, తాను కూడా గొంతు కోసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు .

Show Full Article
Print Article
Next Story
More Stories