ప్రధాని మోడీ హత్యకు కుట్ర : వరవరరావు ఇంట్లో సోదాలు
ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర కేసులో పూణే పోలీసులు విరసం నేత వరవరరావుపై కేసు నమోదు చేశారు. మావోయిస్టులకు వరవరరావు నిధులు సమకూర్చారని ఆరోపిస్తూ పుణె నుంచి వచ్చిన పోలీసులు గాంధీనగర్లోని వరవరరావు నివాసంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ గాంధీనగర్లోని ఆయన ఇంట్లోకి చొరబడ్డ పోలీసులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయించి, లోపలినుంచి తాళాలు వేయించి సోదాలు నిర్వచించారు. అలాగే నాగోల్లో ఉంటున్న ఓ జర్నలిస్టు ఇంట్లో కూడా పోలీసులు సోదాలు నిర్వచించారు.
Next Story




