చెట్టుకు ఉరి వేసుకుని యువతియువకుడు ఆత్మహత్య

nanireddy
Updated on: 24 Dec 2018 2:50 PM IST
చెట్టుకు ఉరి వేసుకుని యువతియువకుడు ఆత్మహత్య
X

చెట్టుకు ఉరి వేసుకుని యువతియువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం నర్సాపూర్ గ్రామంలో జరిగింది. నర్సాపూర్ గిరిజన తండాకు చెందిన యువతియువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇంట్లో వాళ్ళు ప్రేమను నిరాకరించిన కారణంగా మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని తెలుస్తోంది. అటవీ శివారు ప్రాంతంలోని పొలంలో ప్రేమికులు చెట్టుకి ఉరివేసుకుని మరణించడాన్ని గమనించిన ఓ రైతు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులు నర్సాపూర్ గ్రామానికి చెందిన సెడ్మకి అర్జున్,మాడవి సావిత్రిభాయి లుగా గుర్తించారు.

nanireddy

nanireddy

Next Story