కాళ్లు, చేతులు నరికి బ్యూటీషియన్‌పై హత్యాయత్నం.. కారణం ఏంటంటే..

కాళ్లు, చేతులు నరికి బ్యూటీషియన్‌పై హత్యాయత్నం.. కారణం ఏంటంటే..
x
Highlights

కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో బ్యూటీషియన్‌పై హత్యాయత్నం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆమె కాళ్లు కట్టేసి చేతులను దారుణం నరికేశారు. తీవ్రంగా గాయపడ్డ...

కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో బ్యూటీషియన్‌పై హత్యాయత్నం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆమె కాళ్లు కట్టేసి చేతులను దారుణం నరికేశారు. తీవ్రంగా గాయపడ్డ పద్మను ఏలూరు ఆస్పత్రికి తరలించారు. రాజమహేంద్రవరానికి చెందిన పల్లె పద్మ హనుమాన్‌ జంక్షన్‌ ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఓ బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తోంది. అయితే… ఆమెకు ఇదివరకే సూర్యనారాయణ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికీ ఇద్దరు సంతానం. కాగా… భర్తతో విబేధాల కారణంగా అతనికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఏలూరుకు చెందిన బత్తుల నూతన్‌కుమార్‌ విక్టర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ఓ ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. మూడు రోజుల కిందట పద్మ, నూతన్‌కుమార్‌ల మధ్య గొడవ జరిగింది. ఈ తర్వాత పద్మ ఫోన్‌ స్విచాఫ్‌ రావటంతో అనుమానం వచ్చిన ఆమె కుమార్తె.. తండ్రి సూర్యనారాయణకు సమాచారం ఇచ్చింది. దీంతో శనివారం ఉదయం సూర్యనారాయణ ఆమె ఇంటికి వెళ్లగా.. అక్కడి పరిస్థితి చూసి నిర్ఘాంతపోయాడు. కాళ్లు కట్టేసి, రెండు చేతులు తెగిపోయి, ఒంటిపై బట్టలు లేకుండా పద్మ పడి ఉండటాన్ని గుర్తించి.. వెంటనే హనుమాన్‌ జంక్షన్‌ పోలీసులకు సమాచారం అందజేశాడు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధమే ఈ హత్యాయాత్నానికి కారణమని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories