కాంగ్రెస్ కు బిగ్ షాక్.. టీఆర్ఎస్ లో చేరనున్న మాజీ స్పీకర్?

కాంగ్రెస్ కు బిగ్ షాక్.. టీఆర్ఎస్ లో చేరనున్న మాజీ స్పీకర్?
x
Highlights

తెరాస అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకోసం నిన్న(గురువారం) ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఈ క్రమంలోనే 105 మంది తెరాస అభ్యర్థుల జాబితా కూడా విడుదల చేశారు....

తెరాస అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకోసం నిన్న(గురువారం) ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఈ క్రమంలోనే 105 మంది తెరాస అభ్యర్థుల జాబితా కూడా విడుదల చేశారు. ఇందులో చాలామంది తాజామాజీ ఎమ్మెల్యేలకే టిక్కెట్లు దక్కాయి. ఇక ప్రకటించని కొన్నింటిలో వేరే పార్టీలనుంచి వచ్చే వారికోసం వెయిటింగ్ లిస్టులో ఉంచినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే కాంగ్రెస్ సినియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆయనతో ఇప్పటికే తెరాస నేతలు చర్చించిన సంగతి తెలిసిందే.. తాజాగా కాసేపటి క్రితమే తాజా మాజీ మంత్రి కేటీఆర్ సురేష్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories