అనకాపల్లి బహిరంగసభను హరికృష్ణకు నివాళితో ప్రారంభించిన జగన్

nanireddy
Updated on: 24 Dec 2018 2:46 PM IST
అనకాపల్లి బహిరంగసభను హరికృష్ణకు నివాళితో ప్రారంభించిన జగన్
X

బుధవారం తెల్లవారుజామున నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీ, సినీనటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం చెందారు. అయన మృతితో కుటుంబసభ్యులు, నందమూరి అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. కాగా అయన మృతికి వైసీపీ అధినేత వైయస్ జగన్ సంతాపం తెలిపారు . ప్రస్తుతం విశాఖ జిల్లా అనకాపల్లి పాదయాత్రలో పాల్గొన్న జగన్. ముందుగా ఇవాళ తెల్లవారుజామున నందమూరి హరికృష్ణ అకాల మరణం చెందారని అయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు.. కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని అశేష జనవాహిని మధ్య అన్నారు.

nanireddy

nanireddy

Next Story