జడేజా దెబ్బకు కకావికలం

జడేజా దెబ్బకు కకావికలం
x
Highlights

ఆసియాకప్‌లో టీమిండియా మరో విక్టరీ కొట్టింది. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ విజయం నమోదుచేసిన భారత్ తాజాగా బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. వన్‌సైడ్‌గా...

ఆసియాకప్‌లో టీమిండియా మరో విక్టరీ కొట్టింది. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ విజయం నమోదుచేసిన భారత్ తాజాగా బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. వన్‌సైడ్‌గా మారిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు భారత బౌలర్ల ధాటికి కుప్పకూలారు. జడేజా(4/29) దెబ్బకు పాక్ జట్టు కకావికలమైంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 49.1 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌటైంది. మెహదీ హసన్‌ మిరాజ్‌ (50 బంతుల్లో 42; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగుకూ దిగిన భారత్‌ 36.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసి సూపర్ విజయాన్నందుకుంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (104 బంతుల్లో 83 నాటౌట్‌ గా నిలిచాడు. శిఖర్‌ ధావన్‌ (47 బంతుల్లో 40 , ధోని 37 బంతుల్లో 33 రాణించడంతో భారత్ విజయం ఖరారైంది. ఇక రేపు(ఆదివారం) పాకిస్థాన్ తో భారత్ తలపడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories