బ్యూటీషియన్‌ పద్మపై దాడి కేసులో ట్విస్ట్ : రైలు కింద పడ్డ ప్రియుడు

బ్యూటీషియన్‌ పద్మపై దాడి కేసులో ట్విస్ట్ : రైలు కింద పడ్డ ప్రియుడు
x
Highlights

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్‌ పిల్లి పద్మ హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న ఆమె ప్రియుడు నూతన్‌ కుమార్‌...

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్‌ పిల్లి పద్మ హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న ఆమె ప్రియుడు నూతన్‌ కుమార్‌ ఆత్మహత్యకు చేసుకున్నాడు. పద్మపై క్రూరంగా దాడి చేసిన తర్వాత పరారీలో ఉన్న నూతన్‌ కుమార్‌ పట్టాలపై విగతజీవిగా పడి ఉన్నాడు. గుంటూరు-నరసరావు పేట మధ్య నడిచే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బ్యూటీషియన్‌ పద్మపై దాడి అనంతరం నూతన్‌ కుమార్‌ అదృశ్యమైన సంగతి తెలిసిందే. నూతన్‌ కోసం నాలుగు పోలీస్‌ బృందాలు గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో అతను ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories