పానీపూరీ తింటూ.. స్కూటర్‌పై షికారు చేస్తూ

పానీపూరీ తింటూ.. స్కూటర్‌పై షికారు చేస్తూ
x
Highlights

వాజ్ పేయి మరణం ఆయన ఆత్మ మిత్రుడు అడ్వానీని తీవ్రంగా కలచి వేసింది.65 ఏళ్ల ఆత్మీయస్నేహం వారిది. ఆరెస్సెస్ లో ప్రచారక్ స్థాయి నుంచీ వారిద్దరూ కలసి...

వాజ్ పేయి మరణం ఆయన ఆత్మ మిత్రుడు అడ్వానీని తీవ్రంగా కలచి వేసింది.65 ఏళ్ల ఆత్మీయస్నేహం వారిది. ఆరెస్సెస్ లో ప్రచారక్ స్థాయి నుంచీ వారిద్దరూ కలసి పనిచేశారు. గతకొంత కాలంగా వాజ్ పేయిని తరచుగా కలిసిన వ్యక్తి కూడా అ ద్వానీయే.. తన ఆప్త మిత్రుడిని కోల్పోవడంతో మాటలు రావడం లేదన్నారు అడ్వానీ.

భారతదేశ రాజకీయాల్లో ఎదురులేని విధంగా ఎదిగిన నేషనల్ కాంగ్రెస్ పార్టీకి మేమే ప్రత్యామ్నాయంటూ ఎదిగిన పార్టీయే భారతీయ జనతా పార్టీ. తలాతోక లేని బీజేపీకి జవసత్వాలు అందించి జీవం పోసిన దిగ్గజాలే వాజ్‌పేయి, అద్వానీ. 1980, ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించిన ఈ దిగ్గజ రాజకీయ నేతలు పార్టీ ప్రస్థానాన్ని అప్పటి నుంచి ప్రారంభించి దేశంలో పరుగులు పెట్టించారు. భారతదేశ యవనికపై బీజేపీని తిరుగులేని పార్టీగా నిలిపారు.

బీజేపీకి అటల్ బిహారీ వాజపేయి తొలి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసిన వ్యక్తి అద్వానీ. 1984లో, ఇందిరా గాంధీ హత్య తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలోకాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించగా, బీజేపీ 543 నియోజకవర్గాలలో కేవలం రెండింటిని గెలుపొందింది. మతతత్వ పార్టీ ముద్రను తొలగించుకుని దేశంలో బలీయమైన శక్తిగా ఎదిగేందుకు వాజ్‌పేయి, అద్వానీ చేసిన కృషి అమోఘమంటారు రాజకీయ పండితులు. ఒకప్పుడు సింగిల్ డిజిట్‌తో లోక్‌సభలో ఉన్న కమలనాథులు అనతికాలంలోనే దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో పాగా వేయడంలో వీరు చూపించిన రాజనీతే కారణమంటారు.

లాల్‌కృష్ణ అద్వానీ రథయాత్రతో 1989 లోక్‌సభ ఎన్నికలలో 88 సీట్లను గెలుచుకున్నారు కమలనాథులు. 1991 లోక్‌సభ ఎన్నికలలో 120కి పెంచుకొని ప్రధాన ప్రతిపక్షంగా మారడానికి ఈ ఇద్దరు రాజకీయ ఉద్దండుల కృషే కారణం. 1996 లోక్‌సభ ఎన్నికలలో అతి పెద్ద రాజకీయ పక్షంగా అవతరించడంతో వాజ్‌పేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1998 ఎన్నికల్లో కూడా మెజారీటీ స్థానాలను గెలుపొందింది. 13 నెలలకే పతనమైంది. 1998 నుంచి 2004 మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అప్పుడే ప్రధానిగా వాజ్‌పేయి, ఉప ప్రధానిగా అద్వానీ తమ రాజకీయ చతురతతో దేశ ప్రగతిని పరుగులు పెట్టించారు.

వాజ్‌పేయ్ తరువాత అద్వానీ పార్టీ పగ్గాలను చేపట్టారు. పార్టీని ముందుకు తీసుకువెల్లడంలో ఎంతో కీలకంగా కూడా వ్యవహరించారు. తరువాత పార్టీ పగ్గాలు ఎంత మంది చేతులు మారినా అధికారానికి మాత్రం చేరువ కాలేదు. ఏమైనా వాజ్‌పేయితో తన స్నేహం అపూర్వమైనదంటారు అద్వానీ అన్నారు. వాజ్‌పేయితో సుదీర్ఘ స్నేహబంధం అపూర్వమైంది. వాజ్‌పేయి తాను యువకులుగా ఉన్నప్పుడు స్కూటర్‌పై తిరిగే వాళ్లమంటారు అద్వానీ. తాము ఇద్దరం కలిసి చాట్ తినేందుకు ఢిల్లీలోని కనాట్ ప్లేస్‌కు వెళ్లేవారిమని గుర్తుచేసుకుంటారు. బీజేపీ జాతీయ పార్టీగా ఎదుగుదలలో వాజ్‌పేయి, అద్వానీ పోషించిన పాత్ర చరిత్రకు సజీవ సాక్ష్యం.

Show Full Article
Print Article
Next Story
More Stories