నేనేం తప్పు చేయలేదు.. చేసింది సరైన పనే : అనసూయ

నేనేం తప్పు చేయలేదు.. చేసింది సరైన పనే : అనసూయ
x
Highlights

యాంకర్ కం.. నటి అనసూయపై మరోసారి నెటిజన్లు మరోసారి మండిపడ్డారు. ఆమె తప్పు ఇసుమంతైనా లేకపోగా.. దురదృష్టవశాత్తు సోషల్ మీడియాలో పలువురు నెటిజెన్ల నుంచి...

యాంకర్ కం.. నటి అనసూయపై మరోసారి నెటిజన్లు మరోసారి మండిపడ్డారు. ఆమె తప్పు ఇసుమంతైనా లేకపోగా.. దురదృష్టవశాత్తు సోషల్ మీడియాలో పలువురు నెటిజెన్ల నుంచి అనసూయ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. యాంకర్ అనసూయ హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 గుండా వెళుతున్నారు. ఇంతలో ఓ వ్యక్తి కారు డ్రైవ్ చేసుకుంటూ అనసూయ కారును ఓవర్ టేక్ చేశాడు. అయితే అతను డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ లో వీడియోలు చూస్తున్నాడు. దీంతో అనసూయ ఈ దృశ్యాన్ని వీడియో తీసి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ట్విట్టర్ లో ట్యాగ్ చేసింది. 'డియ‌ర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌.. ఇలాంటి సంఘ‌ట‌న‌లు నన్ను భయ‌పెట్టిస్తున్నాయి. ఇంత‌కు ముందు వేరే వారి త‌ప్పిదం వ‌ల‌న నేను ప్ర‌మాదానికి గుర‌య్యాను. ద‌య చేసి ఇలాంటి నిర్ల‌క్ష్య‌పు డ్రైవ‌ర్స్‌ని వ‌దలొద్దు.రోడ్లపైకొచ్చి త‌మ‌కిష్ట‌ మొచ్చిన‌ట్టు డ్రైవ్ చేసే వారికి.. ఇత‌రుల ప్రాణాలంటే లెక్క‌లేదా? అని అన‌సూయ త‌న ట్వీట్‌లో పేర్కొంది అనసూయ. అయితే ఆ వీడియో సందేశంపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. మీరు చీఫ్ పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నారు, మీరు ఎప్పుడు ఈ పని చేయలేదంటూ అనసూయను ట్రోల్ చేస్తున్నారు.. దీనికి స్పందించిన అనసూయ వీటిని తాను పట్టించుకోనని.. నేనేం తప్పు చేయలేదు. నేను చేసింది సరైన పనే అని రీట్వీట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories