టీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు? తేల్చేసిన అమిత్ షా..

టీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు? తేల్చేసిన అమిత్ షా..
x
Highlights

గతకొద్ది రోజులుగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ తో పొత్తు పెట్టుకుంటుందనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ రెండు పార్టీలు కచ్చితంగా పొత్తు...

గతకొద్ది రోజులుగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ తో పొత్తు పెట్టుకుంటుందనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ రెండు పార్టీలు కచ్చితంగా పొత్తు పెట్టుకుంటాయని కాంగ్రెస్ ఘంటా పధంగా చెబుతోంది. ఇందుకు ఉదాహరణ ఇటీవల పార్లమెంటులో టిఆర్ఎస్ ఎంపీల తీరు.. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ నేతలను స్వయంగా పిలిచి మరీ మాట్లాడటమేనని అంటున్నారు. అయితే ఈ పొత్తు వార్తల గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తేల్చేశారు. కర్నూల్ జిల్లా మంత్రాలయం వెళ్లేందుకు గురువారం హైదరాబాద్‌ వచ్చిన ఆయన శంషాబాద్‌ విమానాశ్రయంలో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ముందస్తుకు సిద్ధం కావాలని పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు. ముందస్తు ఎన్నికలను ఎట్టి పరిస్థితిలో కూడా ఆషామాషీగా తీసుకోవద్దని ఆదేశించారు. తెరాసతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని కొందరు నేతలు అమిత్ షా తో చెప్పారు. దీనికి ఆయన ప్రభుత్వాలు సహకరించుకోవడంలో తప్పులేదని బదులిచ్చారు. పైగా వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్లాలని సూచించారు. అమిత్ షా నిర్ణయంతో టీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు అన్న ఒక రూమర్ కు పులుస్టాప్ పడినట్లయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories