Petrol Rate: దేశవ్యాప్తంగా మరోమారు పెరిగిన ఇంధన ధరలు
Petrol Rate: ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన పెట్రోల్ ,డీజిల్ ధరలు * పెట్రోల్ 30 పైసలు, డీజిల్ పై 29 పైసలు పెంపు
Representational Image
Petrol Rate: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోమారు పెరిగాయి. రోజువారీ ధరల సమీక్షలో భాగంగా ఈరోజు పెట్రోల్ ధర 30 పైసలు డీజిల్ ధర 29 పైసలు చొప్పున పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 97.93 వద్దకు చేరగా, డీజిల్ ధర లీటర్ కు 92.83 వద్ద కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 94 రూపాయల 23 పైసలుగా వుండగా డీజిల్ ధర 85 రూపాయల 15 పైసలు వద్దకి చేరింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయల మార్క్ను దాటింది...తెలగాణలోని అన్ని జిల్లాల్లో వంద రూపాయలకు చేరువలో పరుగులు పెడుతోంది. దేశంలో మే 3 నుంచి ఇంధన ధరలు పెట్రోల్ లీటరు పై 3 రూపాయల 83 పైసలు , డీజిల్ పై 4 రూపాయల 42 పైసలు చొప్పున పెరిగాయి.
Next Story




