ఈపీఎఫ్ చందాదారులకు శుభవార్త.. పీఎఫ్ ఎకౌంట్ల వడ్డీరేట్ల పెంపు

ఈపీఎఫ్ చందాదారులకు శుభవార్త.. పీఎఫ్ ఎకౌంట్ల వడ్డీరేట్ల పెంపు
x
Highlights

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) 6 కోట్ల మంది చందాదారులకు కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తీపికబురు అందించారు. 2018-19 ఆర్థిక...

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) 6 కోట్ల మంది చందాదారులకు కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తీపికబురు అందించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) చందాదారులకు వారి పీఎఫ్ అకౌంట్లపై త్వరలోనే 8.65 శాతం వడ్డీ రేటు లభిస్తుందని చెప్పారు.

2017-18 ఆర్థిక సంవత్సరపు వడ్డీ రేటుతో (8.55 శాతం) పోలిస్తే 2018-19 ఆర్థిక సంవత్సరం పీఎఫ్ వడ్డీ 10 బేసిస్ పాయింట్లు (8.65 శాతం) ఎక్కువగా ఉంది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే వడ్డీ రేటు పెరగ డం ఇదే తొలిసారి.

ఈపీఎఫ్‌వోకు సంబంధించిన నిర్ణయాధికారం సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్‌ (సీబీటీ)కే ఉంటుంది. సీబీటీనే పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఇది ఫిబ్రవరి నెలలోనే వడ్డీ రేటు పెంపునకు ఓకే చేసింది. వడ్డీ రేటు పెంపునకు ప్రతిపాదనకు సీబీటీ ఆమోదం తర్వాత ఆర్థిక శాఖ అనుమతి కావాలి. ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం కూడా లభించింది.

పండుగ సీజన్ కన్నా ముందుగానే పీఎఫ్ సబ్‌స్క్రైబర్లు 8.65 శాతం వడ్డీ రేటు లభిస్తుందని సంతోష్ గంగ్వార్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సబ్‌స్క్రైబర్ల క్లెయిమ్స్‌ను 8.55 శాతం వడ్డీ రేటుతో సెటిల్ చేస్తోంది.

ఈపీఎఫ్‌వో 2017-18లో సబ్‌స్క్రైబర్లకు 8.55 శాతం వడ్డీ రేట్లను అందించింది. ఇది ఐదేళ్ల కనిష్ట వడ్డీ రేటు. 2016-17లో వడ్డీ రేటు 8.65 శాతంగా, 2015-16లో 8.8 శాతంగా ఉంది. 2013-14లో వడ్డీ రేటు 8.75 శాతంగా ఉంది. 2014-15లోనూ ఇదే వడ్డీ రేటు కొనసాగింది. 2012-13లో వడ్డీ రేటు 8.5 శాతం.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories