రెండోరోజూ పెరిగిన పెట్రోల్ ధర! డీజిల్ ధరలూ అదే దారిలో!!

రెండోరోజూ పెరిగిన పెట్రోల్ ధర! డీజిల్ ధరలూ అదే దారిలో!!
x
Highlights

వరుసగా రెండోరోజూ 09-11-2019 పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాదులో పెట్రోల్ లీటరుకు 16 పైసలు పెరిగింది.

దాదాపు నెల రోజుల తరువాత దేశీయంగా నిన్న పెరిగిన పెట్రోల్ ధరలు రెండో రోజూ అదేదారిలో ఉన్నాయి. డీజిల్ ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. 09-11-2019 శనివారం పెట్రోల్ ధరలు మళ్లీ పెరుగుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 16 పైసలు పెరిగింది. దీంతో 77.53 రూపాయలకు చేరింది. ఇక డీజిల్ ధర కూడా లీటరుకు 8 పైసలు పెరిగి 71.93 రూపాయలకు చేరుకుంది.

అటు అమరావతిలోనూ ఇదే పరిస్థితి వుంది. ఇక్కడా పెట్రోల్ ధర 15 పైసలు పెరిగి 77.15 రూపాయలు గానూ, డీజిల్ ధర 8 పైసలు పెరిగి 71.23 రూపాయలు గాను ఉన్నాయి. ఇక విజయవాడలో కూడా పెట్రోల్ ధర , డీజిల్ ధర పెరిగాయి. దీంతో అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 15 పైసలు పెరిగి 76.78 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 8 పైసలు పెరిగి 70.89 రూపాయలుగానూ నిలిచాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 15 పైసలు, డీజిలు ధర లీటరుకు 7 పైసలు పెరిగాయి. దీంతో, పెట్రోలు ధర 72.85 రూపాయలుగానూ, డీజిల్ ధర 65.91 రూపాయలుగానూ ఉన్నాయి. వాణిజ్య రాజధాని ముంబయిలోను ఇలాగే ఉంది. అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 14 పైసలు, డీజిలు ధర లీటరుకు 7 పైసలు పెరిగాయి. దీంతో, పెట్రోల్ 78.52 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 69.13 రూపాయలుగానూ ఉన్నాయి.

పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్లుగా అమలులోకి వచ్చింది. ప్రతి ఉదయం ముఖ్య నగరాల్లో ప్రకటించిన పెట్రోల్ ధరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories