చాన్నాళ్ళ తరువాత పైకెగసిన పెట్రోల్ ధరలు!

చాన్నాళ్ళ తరువాత పైకెగసిన పెట్రోల్ ధరలు!
x
Highlights

దాదాపు నెల రోజుల తరువాత దేశీయంగా పెట్రోల్ ధరలు పెరిగాయి. డీజిల్ ధరలు కూడా అదే బాట పట్టాయి.

దాదాపు నెల రోజుల తరువాత దేశీయంగా పెట్రోల్ ధరలు పెరిగాయి. డీజిల్ ధరలు కూడా అదే బాట పట్టాయి. 08-11-2019 శుక్రవారం పెట్రోల్ ధరలు కొద్దిగా పెరుగుదలను నమోదు చేశాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 11 పైసలు పెరిగింది. దీంతో 77.37 రూపాయలకు చేరింది. ఇక డీజిల్ ధర కూడా లీటరుకు 10 పైసలు పెరిగి 71.85 రూపాయలకు చేరుకుంది.

అటు అమరావతిలోనూ ఇదే పరిస్థితి వుంది. ఇక్కడా పెట్రోల్ ధర 11 పైసలు పెరిగి 77.00 రూపాయలు గానూ, డీజిల్ ధర 9 పైసలు పెరిగి 71.15 రూపాయలు గాను ఉన్నాయి. ఇక విజయవాడలో కూడా పెట్రోల్ ధర , డీజిల్ ధర పెరిగాయి. దీంతో అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 10 పైసలు పెరిగి 76.63 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 9 పైసలు పెరిగి 70.81 రూపాయలుగానూ నిలిచాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 10 పైసలు, డీజిలు ధర లీటరుకు 9 పైసలు పెరిగాయి. యధాతథంగా ఉన్నాయి. దీంతో, పెట్రోలు ధర 72.70 రూపాయలుగానూ, డీజిల్ ధర 65.84 రూపాయలుగానూ ఉన్నాయి. వాణిజ్య రాజధాని ముంబయిలోను ఇలాగే ఉంది. అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 10 పైసలు, డీజిలు ధర లీటరుకు 10 పైసలు పెరిగాయి. దీంతో, పెట్రోల్ 78.38 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 69.06 రూపాయలుగానూ ఉన్నాయి.

పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్లుగా అమలులోకి వచ్చింది. ప్రతి ఉదయం ముఖ్య నగరాల్లో ప్రకటించిన పెట్రోల్ ధరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories