Petrol Rate: రెండు వారాలుగా స్థిరంగా పెట్రో ధరలు

Petrol Price Stable in Indian Metro cities
x

ఫైల్ ఇమేజ్ 

Highlights

Petrol Rate: ఇప్పటికే సరికొత్త గరిష్టానికి చేరిన పెట్రో ఉత్పత్తుల ధరలు

Petrol Rate: దేశంలో పెట్రోల్ ,డీజిల్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని మెట్రో నగరాల్లో గత పక్షం రోజులుగా పెట్రో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చివరిసారిగా ఫిబ్రవరి 27 న పెట్రో ధరలను సవరించగా ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో పెట్రోల్ రేటు లీటర్ కు 4 రూపాయల 87 పైసలు. డీజిల్ 4 రూపాయల 99 పైసల మేర పెరిగింది.

రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల 17 పెసల వద్ద స్థిరంగా కొనసాగుతుండగా ఆర్దిక రాజధాని ముంబై లో 97 రూపాయల 57 పైసల వద్దకు చేరింది. తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 94 రూపాయల 79 పైసలు. ఏపీలోని మెట్రో నగరాల్లో 87 రూపాయల 24 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories