ఐదో రోజూ అదే తీరు.. పెట్రోల్, డీజిల్ ధరలలో పెరుగుదల!

ఐదో రోజూ అదే తీరు.. పెట్రోల్, డీజిల్ ధరలలో పెరుగుదల!
x
Highlights

వరుసగా ఐదో రోజూ పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి.

పెట్రోల్, డీజిల్ ధరలు ఐదో రోజూ భారీగా పెరిగాయి. శుక్రవారం తో పోలిస్తే శనివారం పెట్రోల్ 30 పైసలు, డీజిల్ 26పైసలు పెరిగాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 77.97 రూపాయలకు చేరింది. డీజిల్ 72.52 రూపాయలైంది. ఇక అమరావతిలో పెట్రోల్ ధర 30 పైసలు పెరిగి 77.67రూపాయలు గానూ, డీజిల్ ధర25 పైసలు పెరిగి 71.88రూపాయలకు చేరింది. విజయవాడలోనూ పెట్రోల్ ధర 30 పైసలు పెరిగి రూ.77.30, డీజిల్ ధర 26 పైసలు పెరిగి 71.54 రూపాయలకు చేరుకుంది.

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లోనూ పెట్రోల్ ధరలు పెరిగాయి. ముంబాయిలో పెట్రోల్ ధర 29పైసలూ, డీజిల్25 పైసల మేర పెరిగాయి. దీంతో ముంబయిలో పెట్రోల్ ధర 79.02రూపాయలు, డీజిల్ 69.79రూపాయలు గానూ, ఢిల్లీలో పెట్రోల్ ధర 29పైసలూ, డీజిల్24 పైసల మేర పెరగడంతో పెట్రోల్ ధర 73.35రూపాయలుగానూ, డీజిల్ ధర 66.53రూపాయలుగానూ ఉంది.

ఇక అంతర్జాతీయంగా క్రూడాయిలు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిలు ధర 63.20 డాలర్లు గానూ, డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 58.09 డాలర్లు గానూ ఉన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories