నాలుగోరోజూ పెరిగిన పెట్రోల్ ధర

నాలుగోరోజూ  పెరిగిన పెట్రోల్ ధర
x
Highlights

అంతర్జాతీయంగా క్రూడాయిలు ధరలు తగ్గుతున్నా, వరుసగా నాలుగో రోజూ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. శనివారం కంటే ఆదివారం పెట్రోల్ ధర 6 పైసలూ, డీజిల్ 7 పైసల మేర పెరిగాయి.

అంతర్జాతీయంగా క్రూడాయిలు ధరలు తగ్గుతున్నా, వరుసగా నాలుగో రోజూ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. శనివారం కంటే ఆదివారం పెట్రోల్ ధర 6 పైసలూ, డీజిల్ 7 పైసల మేర పెరిగాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 76.57 రూపాయలకు చేరింది. ఇక డీజిల్ 71.33రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా అమరావతిలోనూ పెట్రోల్ ధర 6 పైసల పెరుగుదల చోటుచేసుకుంది. దీంతో ఆదివారం పెట్రోల్ ధర 76.31 రూపాయలు, డీజిల్ ధరలోనూ 7 పైసల పెరుగుదలతో 70.73 రూపాయలకు చేరుకున్నాయి. ఇక విజయవాడలో పెట్రోల్ ధర 6 పైసలు పెరుగుదలతో రూ.75.94కు చేరింది. డీజిల్ ధర కూడా 6 పైసలు పెరుగుదలతో రూ.70.38కు పెరిగింది.

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లోనూ పెట్రోల్ ధర 6పైసలూ, డీజిల్ 6 పైసల మేర పెరిగాయి. దీంతో ముంబయిలో పెట్రోల్ ధర 77.71రూపాయలు, డీజిల్ 68.62 రూపాయలు గానూ, ఢిల్లీలో పెట్రోల్ ధర 72.03రూపాయలుగానూ, డీజిల్ ధర 65.43రూపాయలుగానూ ఉంది.

ఇక అంతర్జాతీయంగా క్రూడాయిలు ధరలు శుక్రవారం తాగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిలు ధర 60.22 డాలర్లు (0.26 శాతం తగ్గుదల) గానూ, డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 54.85 డాలర్లు (0.44 శాతం తగ్గుదల) గానూ ఉన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories