మళ్లీ భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

మళ్లీ భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
x
Highlights

అంతర్జాతీయంగా క్రూదాయిలు ధరలు పెరగడంతో దేశేయంగానూ పెట్రోల్ ధరలు పెరిగాయి. ఎప్పుడూ పది పైసల లోపు పెరిగే ఈ ధరలు.. నిన్న.. ఈరోజు భారీగా పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు పెట్రోల్ ధర 30 పైసలు పెరగడం గమనార్హం.

పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు కూడా భారీగా పెరిగాయి. బుధవారం తో పోలిస్తే గురువారం పెట్రోల్ 30పైసలు, డీజిల్ 21 పైసలు పెరిగాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 77.29 రూపాయలకు చేరింది. డీజిల్ 71.96 రూపాయలైంది. ఇక అమరావతిలో పెట్రోల్ ధర 30 పైసలు పెరిగి 77.01రూపాయలు గానూ, డీజిల్ ధర 20 పైసలు పెరిగి 71.33రూపాయలకు చేరింది. విజయవాడలోనూ పెట్రోల్ ధర 30 పైసలు పెరిగి రూ.76.64, డీజిల్ ధర 20 పైసలు పెరిగిరూ.70.99 రూపాయలకు చేరుకుంది.

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లోనూ పెట్రోల్ ధరలు పెరిగాయి. ముంబాయిలో పెట్రోల్ ధర 29పైసలూ, డీజిల్20 పైసల మేర పెరిగాయి. దీంతో ముంబయిలో పెట్రోల్ ధర 78.39రూపాయలు, డీజిల్ 69.24రూపాయలు గానూ, ఢిల్లీలో పెట్రోల్ ధర 29పైసలూ, డీజిల్19 పైసల మేర పెరగడంతో పెట్రోల్ ధర 72.71రూపాయలుగానూ, డీజిల్ ధర 66.01రూపాయలుగానూ ఉంది.

ఇక అంతర్జాతీయంగా క్రూడాయిలు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిలు ధర 62.77 డాలర్లు గానూ, డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 58.24డాలర్లు గానూ ఉన్నాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories