స్టాక్‌ మార్కెట్లలో ఎగ్జిట్‌ పోల్స్‌ జోష్‌.. సెన్సెక్స్​- నిఫ్టీకి కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు..!

ఎగ్జిట్ పోల్స్ మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Arun Chilukuri
Published on: 3 Jun 2024 9:45 AM IST
Massive Jump In Stock Market After Exit Polls Predict
X

స్టాక్‌ మార్కెట్లలో ఎగ్జిట్‌ పోల్స్‌ జోష్‌.. సెన్సెక్స్​- నిఫ్టీకి కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు..!

Stock Market Today: ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన తర్వాత సోమవారం స్టాక్ మార్కెట్లు అతి భారీ లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్‌లోనే సెన్సెక్స్‌ 1981.49 పాయింట్లు లాభంతో 75,942.80 పాయింట్లు నమోదు చేసింది. నిఫ్టీ 613 పాయింట్లు లాభపడి 23,144 దగ్గర కొనసాగుతోంది. రెండు సూచీలూ ఆరంభంలోనే రికార్డు గరిష్ఠాలను నమోదు చేయడం విశేషం. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83 వద్ద ప్రారంభమైంది. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఈ జోష్‌ కనిపించింది.

ఎగ్జిట్ పోల్స్ మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అధికార బీజేపీ మళ్లీ గెలుస్తుందని మెజారిటీ సర్వేలు చెప్పాయని, ఎన్నికల ప్రభావం మార్కెట్లపై ఉంటుందని ఆనంద్ రాఠి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్‌లో పెట్టుబడి సేవల ప్రాథమిక పరిశోధన హెడ్ నరేంద్ర సోలంకి అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story