స్వల్పంగా పెరిగిన బంగారం..స్థిరంగా కొనసాగుతున్న వెండి!

స్వల్పంగా పెరిగిన బంగారం..స్థిరంగా కొనసాగుతున్న వెండి!
x
Highlights

బంగారం ధరలు ఆదివారం స్వల్పంగా పెరిగాయి.27.10.2019 ఆదివారం పది గ్రాముల బంగారం ధర శుక్రవారం తో పోలిస్తే 10 రూపాయల వరకూ పెరిగింది. కాగా, వెండి ధరలు...

బంగారం ధరలు ఆదివారం స్వల్పంగా పెరిగాయి.27.10.2019 ఆదివారం పది గ్రాముల బంగారం ధర శుక్రవారం తో పోలిస్తే 10 రూపాయల వరకూ పెరిగింది. కాగా, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి.

ఆదివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగింది. దీంతో పది గ్రాముల ధర 40,230 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయలు పైకెగసింది. ఈపెరుగుదలతో 36,880 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక వెండిధరలు రెండోరోజూ ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 48,770 రూపాయల వద్ద నిలిచింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 40,230, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,880 రూపాయలుగానూ ఉన్నాయి.

ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మార్పులు లేకుండా నిలిచింది. దీంతో 38,850 రూపాయల వద్ద 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 37,650 రూపాయల వద్ద నిలకడగా ఉంది. ఇక వెండి ధర ఇక్కడ కూడా స్థిరంగా ఉంది. దీంతో ఢిల్లీలో వెండి ధర కేజీకి 48,770 రూపాయలు వద్ద నిలిచింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 27.10.2019 ఆదివారం ఉదయం 6గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories