వరుసగా నాలుగో రోజు పెరిగిన పెట్రో ధరలు

4th day of Petrol Price Hike in Indian Metro Cities
x

Representational Image

Highlights

* మెట్రోనగరాల్లో పెట్రో ధరలు ఆల్ టైమ్ హై * సరికొత్త రికార్డ్ సృష్టిస్తున్న పెట్రోల్ ధరలు * ముంబై లో 95 రూపాయలకు చేరువన పెట్రోల్ ధర

దేశంలోని మెట్రోనగరాల్లో పెట్రో ధరలు ఆల్ టైమ్ హై కి చేరి సరికొత్త రికార్డ్ సృష్టిస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు ఇంధన ధరలు పెరిగి కొత్త గరిష్ఠాలను తాకాయి పెట్రోలియం కంపెనీలు తాజాగా పెట్రోల్ పై 26 నుంచి 29 పైసలు డీజిల్ పై 34 నుంచి 38 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 87 రూపాయల 85 పైసలు, డీజిల్ 78 రూపాయల 38 పైసలు వద్దకు చేరాయి ఆర్దిక రాజధాని ముంబై లో లీటర్ పెట్రోల్ ధర 94 రూపాయల 64 పైసలుగా నమోదవుతోంది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 91 రూపాయల 65 పైసలు డీజిల్ 85 రూపాయల 50 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories