Shahid Afridi Foundation: అఫ్రిది ఫౌండేషన్‌ లోగోతో మైదానంలోకి పాక్‌ ఆటగాళ్ళు!

Shahid Afridi Foundation: అఫ్రిది ఫౌండేషన్‌ లోగోతో మైదానంలోకి పాక్‌ ఆటగాళ్ళు!
x
Pakistan Cricketers with Shahid Afridi Foundation Logo
Highlights

Shahid Afridi Foundation: కరోనా వలన నష్టపోయిన రంగాలలో క్రికెట్ ఒకటి.. మ్యాచ్ లు లేకా అన్ని క్రికెట్‌ బోర్డుల ఆదాయాలు పడిపోయాయి..

Shahid Afridi Foundation: కరోనా వలన నష్టపోయిన రంగాలలో క్రికెట్ ఒకటి.. మ్యాచ్ లు లేకా అన్ని క్రికెట్‌ బోర్డుల ఆదాయాలు పడిపోయాయి.. ఈ క్రమంలో స్పాన్సర్లు లేకా సతమతమవుతోంది పాకిస్తాన్.. ఆగస్టులో ఇంగ్లాండ్‌తో జరగబోయే సిరీస్‌లో భాగంగా జాతీయ జట్టుకు స్పాన్సర్‌షిప్‌ అందించేందుకు ఏ కంపెనీ కూడా ముందుకు రాలేదు. దీనితో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్‌ అఫ్రిదికి చెందిన ఛారిటీ ఫౌండేషన్‌ లోగోను ధరించాలని పీసీబీ( పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు) నిర్ణయించింది.

తాజాగా కరోనా నుంచి కోలుకున్న షాహిద్‌ అఫ్రిది ఈ విషయాన్నీ వెల్లడించాడు. ఇంగ్లాండ్‌ టూర్‌లో పాక్ క్రికెటర్ల కిట్లపై తమ ఫౌండేషన్‌ లోగో ఉంటున్నందుకు తనకి ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు పీసీబీతో సహా, సీఈవో వసీం ఖాన్‌కు అఫ్రిది ధన్యవాదాలు చెప్పాడు. అలాగే ఈ పర్యటనలో పాక్‌ జట్టు విజయం సాధించాలని కోరుకుంటున్నట్లుగా అఫ్రిది వెల్లడించాడు. ఇక అంతకుముందు పానీయాల సంస్థ పెప్సీతో పిసిబి ఒప్పందం ముగిసిన సంగతి తెలిసిందే..

ఇక తాజాగా తమతో స్పాన్సర్‌షిప్‌ చేసుకొనేందుకు ఓ కార్పొరేట్‌ సంస్థ సిద్ధంగా ఉందని, ప్రస్తుతం దానిపైన చర్చలు జరుగుతున్నాయని పీసీబీ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే తాము అనుకున్న దాని కన్నా చాలా తక్కువ మొత్తం చెల్లించేందుకు ఆ సంస్థ ముందుకొచ్చిందని, అది కూడా గతంలో చెల్లించిన మొత్తంలో 40 శాతమేనని ఆ అధికారి వెల్లడించాడు.

ఇక ఆగస్టులో ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం ఇప్పటికే పాక్‌ జట్టు ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు. ఇందులో ఆగస్టు 5 నుంచి 25 వరకు మూడు టెస్టులు జరగగా, ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 1 వరకు మూడు టీ20లు జరగనున్నాయి. దీనికి ముందు ఆటగాళ్లకి పలుమార్లు కరోనా టెస్టులు నిర్వహించింది పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు. ఇందులో నెగిటివ్ అని వచ్చిన వారిని మాత్రమే ఇంగ్లాండ్‌కు పంపించింది బోర్డు..

Show Full Article
Print Article
Next Story
More Stories