కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు

Nampally court orders to file case against minister Konda Surekha over Akkineni Nagarjuna petition
X

 కొండా సురేఖపై కేసు: నాంపల్లి కోర్టు ఆదేశం

మంత్రి కొండా సురేఖకు గురువారం నాడు నాంపల్లి కోర్టు సమన్లు పంపింది. సురేఖపై నటులు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.డిసెంబర్ 12న వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.

అక్కినేని నాగచైతన్య, సమంతల విడాకుల విషయంలో మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ విషయమై నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు మంత్రి సురేఖకు సమన్లు పంపారు.ఈ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలకు సమంతకు సురేఖ క్షమాపణలు చెప్పారు.ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story