Supreme Court: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు.. వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట

Supreme Court: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 13 Sept 2024 1:27 PM IST
YSRCP Leaders Get Relief In Supreme Court In The Case Of Attack On TDP Office
X

Supreme Court: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు.. వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట

Supreme Court: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ముందస్తు బెయిల్‌ను ఏపీ హైకోర్టు నిరాకరించింది. దీంతో వైసీపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేవినేని అవినాష్, జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, గవాస్కర్‌లకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

విచారణకు జోగి రమేష్, దేవినేని అవినాష్‌లు సహకరించాలని.. 48 గంటల్లోగా పాస్‌పోర్ట్‌లు సమర్పించాలని ఆదేశించింది. నవంబర్ 4వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు. వైసీపీ తరఫున న్యాయవాదులు కపిల్ సిబల్, నీరజ్ కిషన్ కౌశల్, అల్లంకి రమేష్ తమ వాదనలు వినిపించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story