YSR Bheema Scheme: పేద ‌కుటుంబాల‌కు అండ‌గా.. 'వైఎస్సార్ బీమా' పధకం

YSR Bheema Scheme: పేద ‌కుటుంబాల‌కు అండ‌గా.. వైఎస్సార్ బీమా పధకం
x

ysr bheema Scheme update information and process to apply

Highlights

YSR Bheema Scheme: పేద ‌కుటుంబాల‌కు సామాజిక భ‌ద్ర‌త క‌ల్పించాల‌నే ల‌క్ష్యంగా జ‌గ‌న్ స‌ర్కార్ తాజాగా ‘వైఎస్సార్ బీమా పధకానికి శ్రీకారం చుట్టింది. ఈ పధకానికి సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది.

YSR BHIMA Scheme: పేద ‌కుటుంబాల‌కు సామాజిక భ‌ద్ర‌త క‌ల్పించాల‌నే ల‌క్ష్యంగా జ‌గ‌న్ స‌ర్కార్ తాజాగా 'వైఎస్సార్ బీమా పధకానికి శ్రీకారం చుట్టింది. ఈ పధకానికి సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, బియ్యం కార్డు ఉన్నా కుటుంబ పెద్దలకు వైఎస్సార్‌ బీమా పథకం వ‌ర్తిస్తుంది. ఈ ప‌థ‌కం ద్వారా ఒక‌టిన్న‌ర కోట్ల కుటుంబాల పెద్ద‌లు, లేదా కుటుంబాన్ని పోషించే వ్య‌క్తులకు ఈ ప‌థ‌కం వ‌ర్తించును. ఈ ప‌థ‌కం ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వమే చెల్లిస్తుంది.

ఈ ప‌థ‌కానికి నోడ‌ల్ ఏజెన్సీగా కార్మిక సంక్షేమ మ‌రియు ఉపాధి క‌ల్ప‌న శాఖ వ్య‌వ‌హ‌రిస్తుంది. కేత్ర‌స్థాయిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామీణ పేద‌రిక నిర్మూల‌న సంస్థ ( వైఎస్ ఆర్ కాంత్రి ప‌థం) ముఖ్య కార్యనిర్వ‌హ‌ణాధికారి ద్వారా ఈ ప‌థ‌కం అమ‌లవుతుంది. గ్రామ లేదా వార్డు స‌చివాల‌యంలో నియ‌మించ‌బ‌డిన వెల్ఫేర్ అసిస్టెంట్ ఈ ప‌థ‌కానికి రిజిస్ట్రేష‌న్ అథారిటీగా వ్య‌వ‌హ‌రిస్తారు.

ప్ర‌యోజ‌నాలు:

18 నుండి 50 సంవ‌త్సరాల మ‌ధ్య వ‌య‌సు ‌వారు ప్ర‌మాద‌వ‌శాత్తు శాశ్వ‌త వైక‌ల్యం సంభ‌వించినా లేదా మ‌ర‌ణించినా బాధిత కుటుంబానికి ఈ ప‌థ‌కం ద్వారా రూ. 5 ల‌క్ష‌లను ఉప‌శ‌మ‌నంగా అందిస్తారు. అలాగే 51 నుంచి 70 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు ‌వారు ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణిస్తే బాధిత కుటుంబానికి ఈ ప‌థకం ద్వారా రూ. 3 ల‌క్ష‌లను ఉప‌శ‌మ‌నంగా అందిస్తారు . అదేవిధంగా 18 నుంచి 50 సంవ‌త్సరాల వారు స‌హ‌జ మ‌ర‌ణం పొందితే.. 2 ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక ఉప‌‌శ‌మ‌నం అందుతాయి.

అర్హ‌త‌లు:

- రైస్ కార్డు కలిగి ఉండి.. 18 నుంచి 70 సంవ‌త్స‌రాలు గల కుటుంబ పెద్ద ఈ ప‌థ‌కానికి అర్హులు.

- ల‌బ్దిదారులు వ‌య‌సుని ఆధార్ కార్డు ద్వారా లెక్కిస్తారు.

- మాగాణి అయితే 2.5 ఎక‌రాల లోపు మాత్ర‌మే ఉండాలి.

- అలాగే మెట్ట భూమి అయితే.. 5 ఎక‌రాల లోపు ఉండాలి.

అన‌ర్హులు

- ఆదాయ‌పు ప‌న్ను చెల్లింపు దారులు, ప్ర‌భుత్వ ఉద్యోగులు,

- పీఎఫ్ మ‌రియు ఈపీఎఫ్ చెల్లించే వారు

- గృహిణులు , విద్యార్థులు,

- యాచ‌కులు, మ‌తిస్థిమితం లేనివారు.

గ్రామ/వార్డు వలంటీర్‌ తమ స్మార్ట్‌ఫోన్లలో వైఎస్‌ఆర్‌ బీమా మొబైల్‌ అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకొని బియ్యం కార్డుదారుని ఇంటి వద్దకు వెళ్లి రైస్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతాలను తనిఖీచేసి కుటుంబ సభ్యులతో మాట్లాడి కుటుంబాన్ని పోషించే వ్యక్తిని ఎంపిక . ఈ పథకానికి సంబంధించి అర్హులకు త్వరలోనే బీమా కార్డు మంజూరవుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు.

నామినీ గా ఎవరు ఉండాలి:

- పాలసీదారు భార్య / 21 సం౹౹ పూర్తి కానీ కొడుకు / పెళ్లి కాని కూతురు/ వితంతువు అయిన కూతురు ఒకవేళ ల‌బ్దిదారు తో ఉంటే. వైఎస్సార్ బీమా ప‌థ‌కం / ల‌బ్దిదారు మీద ఆధార పడిన తల్లిదండ్రులు / వితంతువు అయిన కోడలు లేదా ఆమె పిల్లలు.

ఏదైనా జాతీయ బ్యాంకు లో సేవింగ్స్ లేదా జన ధన్ ఖాతా తెరవాలి, అప్పుడే నామినీ పేరును సూచించాలి. సంవత్సరానికి ప్రీమియం ₹15/- వ్యక్తులు చెల్లించాలి. అనంత‌రం ల‌బ్దిదారుల‌కు ఐడెంటిటీ కార్డు ఇస్తారు అందులో విశిష్ట గుర్తింపు సంఖ్య(Unique Id), పాలసీ నెం. ఉంటాయి.క్లెయిమ్ ఇంటిమేట్ చేసిన 15 రోజుల లోపల బీమా చెల్లించాలి. క్లెయిమ్ అమౌంట్ నేరుగా వాళ్ళ బ్యాంకు అకౌంట్ ల‌కే పంపించ‌బ‌డుతుంది. ఈ బీమా విషయంలో లేదా క్లెయిమ్ చెల్లింపు విషయం లో ఏమైనా ఫిర్యాదులు ఉంటే పీడీ, డీఆర్‌డీఏ సంప్రదించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories