వైఎస్సార్‌కు కుటుంబసభ్యుల నివాళులు

Arun Chilukuri
Published on: 2 Sept 2020 10:09 AM IST
వైఎస్సార్‌కు కుటుంబసభ్యుల నివాళులు
X

YSR 11th Death Anniversary: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అనంతరం అక్కడ నిర్వహించిన ప్రార్థనల్లో జగన్ పాల్గొన్నారు. జగన్‌తో పాటు కుటుంబసభ్యులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు, అభిమానులు వైఎస్సార్‌కు నివాళులర్పించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story