Vijaysai Reddy: జగన్ పై దాడి హేయమైన చర్య

Vijaysai Reddy: దాడి ఘటనవెనక చంద్రబాబు ఉన్నాడని అనుమానం

Jyothi
Published on: 14 April 2024 10:48 AM IST
Vijaysai Reddy Sensational Allegations on the Attack on CM Jagan
X

Vijaysai Reddy: జగన్ పై దాడి హేయమైన చర్య

Vijaysai Reddy: సీఎం జగన్ మీద జరిగిన దాడిపై నెల్లూరు వైసీపీ అభ్యర్ధి విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దాడి హేయమైన చర్య అన్నారు. ఈ దాడి వెనుక టీడీపీ నేతలు...చంద్రబాబు ఉన్నాడని అనుమానం వ్యక్తం చేశారు. హింస ద్వారా అధికారంలోకి రావాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. గతంలో కూడా విశాఖపట్నంలో జగన్ పై జరిగిన దాడిపై చంద్రబాబు విపరీత అర్దాలను చంద్రబాబు ప్రచారం చేశారన్నారు. అధికారం కోల్పోయి ఐదేళ్లు అయినా చంద్రబాబు పాఠాలు నేర్చుకోకుండా హింసా ధోరణిలో ప్రవర్తిస్తున్నారన్నారు. ఎన్నికల సంఘం ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపాలని కోరారు.

Jyothi

Jyothi

Next Story