వార్డు సచివాలయ ఏఎన్ఎంలకు శిక్షణ

వార్డు సచివాలయ ఏఎన్ఎంలకు శిక్షణ
x
అడిషనల్ డిఎంహెచ్ఓ రామ సుబ్బారావు
Highlights

వార్డు సచివాలయం లో నూతనంగా నియమితులైన ఏఎన్ఎం లకు పట్టణంలోని ఏరియా ఆసుపత్రి నందు అడిషనల్ డిఎంహెచ్ఓ రామ సుబ్బారావు ఆధ్వర్యంలో వారి విధులపై శిక్షణనిచ్చారు.

కదిరి: వార్డు సచివాలయం లో నూతనంగా నియమితులైన ఏఎన్ఎం లకు పట్టణంలోని ఏరియా ఆసుపత్రి నందు అడిషనల్ డిఎంహెచ్ఓ రామ సుబ్బారావు ఆధ్వర్యంలో వారి విధులపై శిక్షణనిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి 30 తేదీ వరకు ఆరు రోజులపాటు ఇంటింట సర్వే నిర్వహించుటకు గాను ఆర్ సి హెచ్ రిజిస్టర్ ను పంపిణీ చేసి సర్వే విధివిధానాల గురించి వివరించనున్నట్లు పేర్కొన్నారు.వారం రోజుల పాటు నిర్వహించిన సర్వేలో మున్సిపాలిటీ పరిధిలోని 15, 49 సంవత్సరాల మధ్య వయస్సు గల దంపతులను, రెండు సంవత్సరాలలోపు పిల్లలను గుర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories