Tirumala: వేదపాఠశాలలో కరోనా కలకలం.. ఏకంగా 57మందికి పాజిటివ్

Tirumala: వేదపాఠశాలలో కరోనా కలకలం.. ఏకంగా 57మందికి పాజిటివ్
x

ఫైల్ ఇమేజ్ 

Highlights

Tirumala: తిరుమల వేద పాఠశాలలో కరోనా కలకలం రేపింది. 57 మంది వేద పాఠశాల విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. గత నెలలోనే పాఠశాల ప్రారంభంకాగా 450 మంది...

Tirumala: తిరుమల వేద పాఠశాలలో కరోనా కలకలం రేపింది. 57 మంది వేద పాఠశాల విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. గత నెలలోనే పాఠశాల ప్రారంభంకాగా 450 మంది విద్యార్థులకు కొవిడ్ టెస్టులు చేయించారు. వీరిలో 57 మందికి పాజిటివ్ రిపోర్టు రావడంతో వెంటనే వారిని తిరుపతిలోని స్విమ్స్‌కి తరలించారు. వీరిలో కొంతమందికి కరోనా లక్షణాలు లేవని తెలుస్తోంది. ముందస్తు జాగ్రత్తగా పాజిటివ్ తేలిన విద్యార్థులకు దగ్గరగా ఉన్నవారిని క్వారంటైన్‌లో ఉంచారు. వేద పాఠశాలలో విద్యార్థులకు కరోనా ఉందని తేలడంతో టీటీడీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories