Tirumala: వేంకటేశ్వరుడి దర్శనం – ఏ టికెట్‌పై ఎంతసేపు వేచి చూడాలో తెలుసా?

తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. సాధారణంగా వేసవి సెలవుల్లో కనిపించే ఈ భారీ తాకిడి ఈసారి జులై నెలలో కూడా కొనసాగుతోంది. భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Ramya Vegirouthu
Published on: 24 July 2025 9:11 PM IST
Tirumala: వేంకటేశ్వరుడి దర్శనం – ఏ టికెట్‌పై ఎంతసేపు వేచి చూడాలో తెలుసా?
X

Tirumala: వేంకటేశ్వరుడి దర్శనం – ఏ టికెట్‌పై ఎంతసేపు వేచి చూడాలో తెలుసా?

తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. సాధారణంగా వేసవి సెలవుల్లో కనిపించే ఈ భారీ తాకిడి ఈసారి జులై నెలలో కూడా కొనసాగుతోంది. భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆగస్టు నెలలో సెలవులు ఎక్కువగా ఉండటంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

తాజా దర్శన వివరాలు

జులై 21, 2025 (సోమవారం) నాడు:

దర్శనం చేసిన భక్తులు: 77,481 మంది

హుండీ ఆదాయం: రూ. 3.96 కోట్లు

తలనీలాలు సమర్పించిన వారు: 30,612 మంది

టికెట్‌ ఆధారంగా వేచి ఉండే సమయం

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం:

సగటున 7 గంటలు పట్టింది

ఆధార్ వెరిఫికేషన్ సెంటర్‌కు చేరుకోవడానికి మాత్రమే సుమారు 2.5 గంటలు పట్టింది

కంపార్ట్‌మెంట్లు, బయటి లైన్లు భక్తులతో నిండిపోయాయి

సేవా టికెట్ / సుపథం దర్శనం (పిల్లలు, దివ్యాంగులు, వృద్ధులు):

సగటున 3 గంటలు వేచి ఉండాలి

సర్వదర్శనం (SSD టోకెన్లు లేకుండా):

భక్తులు 18 గంటల వరకు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది

భక్తులకు సూచనలు

గత రెండు వారాలుగా ఇదే రద్దీ కొనసాగుతోంది. ఆగస్టులో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున, భక్తులు ముందుగానే దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిది.

Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story