వైసీపీ ప్రభుత్వం అరాచకాలు దౌర్జన్యలు ఎక్కవైనాయి: మాజీ మంత్రి సోమిరెడ్డి

వైసీపీ ప్రభుత్వం అరాచకాలు దౌర్జన్యలు ఎక్కవైనాయి: మాజీ మంత్రి సోమిరెడ్డి
x
Somireddy Chandramohan Reddy Press Meet
Highlights

టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మేయర్ షేక్ అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం నిర్వహించారు.

నెల్లూరు: టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మేయర్ షేక్ అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ...జిల్లాలో వైకాపా ప్రభుత్వ అరాచకాలు, దౌర్జన్యాలు ఎక్కువైపోయాయని, పోలీసులే ఏకంగా రంగంలోకి దిగారని, ఎలాంటి కేసులు లేని నాయకులను కూడా పోలీసుస్టేషన్ కు రమ్మని బెదిరిస్తున్నారని, ఎస్సైలు తమ ఫోన్లతో పాటు కానిస్టేబుళ్ల ఫోన్ల నుంచి టీడీపీ అభ్యర్థులకు, నాయకులకు ఫోన్ చేసి నామినేషన్లను విత్ డ్రా చేసుకోమని బెదిరించడం దుర్మార్గం అని, జిల్లా ఎన్నికల పరిశీలకులకు మేం ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం..పొదలకూరు, మనుబోలు పోలీసుస్టేషన్లకు సంబంధించి ఫోన్ కాల్ డేటా పరిశీలించండి..

అక్కడి ఎస్సైలు ఏం చేస్తున్నారో తెలుస్తుందని, పొదలకూరు బిట్-3 టీడీపీ అభ్యర్థి ఆదాల సుగుణమ్మ నామినేషన్ విత్ డ్రా చేసుకోకపోతే ఆమె ఇంటి వద్ద గది కూలుస్తామని ఓ వైపు సచివాలయం సిబ్బంది బెదిరిస్తూన్నారని, మరోవైపు పొదలకూరు ఎస్సై ఆమె కొడుక్కి ఫోన్ చేసి నామినేషన్ విత్ డ్రా చేసుకోమని, వెళ్లి వైసీపీ నేతలను కలవమని బెదిరిస్తూన్నారని, ఇంతటి ఘోరమైన పరిస్థితులు ఎన్నడూ చూడలేదని, ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించి పెళ్లకూరు మండలంలో ఎన్నికలు వాయిదా వేసి, మళ్లీ నామినేషన్లకు అవకాశం కల్పించాలని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనకు రక్షణ కల్పించని విషయంలో సాక్షాత్తు డీజీపీ హైకోర్టు మెట్లు ఎక్కి చీవాట్లు తినాల్సివచ్చిందని, నెల్లూరు జిల్లా పరిస్థితులపైనా మేం చూస్తూ ఊరుకోబోం..న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నామని తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories