
Srisailam: శ్రీశైలం దేవస్థానానికి ఐఎస్వో గుర్తింపు
Srisailam: అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్నారని 7 రకాల ధృవీకరణ పత్రాలు
Srisailam: శ్రీశైలం దేవస్థానంలో పలుపరిపాలన విధివిధానాలకు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ISO గుర్తింపునిచ్చింది. హెచ్.ఎం.వై సంస్థ ప్రతినిధులు ఈ ధృవీకరణలను రాష్ట్రదేవదాయశాఖమంత్రి కొట్టుసత్యనారాయణ, ఆలయ ఈవో లవన్న కు అందజేశారు. మొత్తం ఏడుధృవీకరణలు లభించగా వాటిలో పరిపాలనా విధివిధానాలకుగాను ISO-9001 : క్యాలిటీ మేనేజ్ మెంట్ ధృవీకరణ, క్షేత్రపరిధిలో పర్యావరణ పరిరక్షణకై దేవస్థానం చేపడతున్న చర్యలకు ISO-14001: పర్యావరణ సమృద్ధీకరణ, భక్తులు, స్థానికులకు కల్పిస్తున్న వైద్యసేవలకు ఐఎన్వో-45001 ఆకుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మెజర్ మెంట్, అన్నదానం, ప్రసాదాల తయారీలో నాణ్యతాప్రమాణాలకు
ఐఎస్వో-22000: ఫుడ్ సేప్టీ మేనేజ్ మెంట్ సమృద్ధీకరణ, అధునాతనపద్ధతిలో సీసీ కెమరాల నిర్వహణ, సాఫ్ట్ వేర్ వినియోగానికి సంబంధించి ISO 27001: ఇన్ఫర్మేషన్ అండ్ సెక్యూరిటీ మేనేజ్ మెంట్, ఎల్ ఈడీ దీపాల వినియోగంకు ISO-50001: ఎనర్జీమేనేజ్మెంట్, పారిశుద్ధ్య నిర్వహణ కు గుడ్ హైజెనిక్ సర్టిఫికెట్లు లభించాయి. ఈసందర్భంగా హెచ్.వై.ఎం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి శివయ్య మాట్లాడుతూ దేవస్థానం పాటిస్తున్న ఉన్నత ప్రమాణాలను పరిశీలించి దేవస్థానానికి ఈధృవీకరణలు అందజేశామని తెలిపారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




