వ్యవసాయ మార్కెట్ కమిటీలను అభివృద్ధి చేస్తాం: శ్రీకాంత్ రెడ్డి

వ్యవసాయ మార్కెట్ కమిటీలను అభివృద్ధి చేస్తాం: శ్రీకాంత్ రెడ్డి
x
Highlights

రైతు సంక్షేమమే జగనన్న ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

లక్కిరెడ్డిపల్లి: రైతు సంక్షేమమే జగనన్న ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం లక్కిరెడ్డిపల్లెలో లక్కిరెడ్డిపల్లె వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన కమిటీ అధ్యక్షురాలు సునీత భూషణ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆవుల నాగ భూషణ్ రెడ్డి, కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, రాయచోటి నియోజక వర్గంలోని అన్ని చెరువులను కృష్ణా జలాలతో నింపేందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ఎన్ని నిధులు ఇచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నారన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇది రైతు ప్రభుత్వమన్నారు. ఫిబ్రవరి నుంచి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటవుతున్నట్లు తెలిపారు. గోదాము కేంద్రాలు, మామిడి ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులుకు మంచి జరిగే విధంగా నూతన మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు, ఉపాధ్యక్షుడు, సభ్యులు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories