Nellore: ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. ఒకే రోజు ఆరుగురు మృతి.. ఏం జరిగిందంటే..?

Nellore: నెల్లూరు జిల్లా జీజీహెచ్ ఆస్పత్రిలో ఒకేరోజు ఆరుగురు మృతి చెందడం కలకలం రేపింది.

Arun Chilukuri
Published on: 22 July 2023 5:03 PM IST
Six Dead in Nellore Government Hospital
X

Nellore: ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. ఒకే రోజు ఆరుగురు మృతి.. ఏం జరిగిందంటే..?

Nellore: నెల్లూరు జిల్లా జీజీహెచ్ ఆస్పత్రిలో ఒకేరోజు ఆరుగురు మృతి చెందడం కలకలం రేపింది. MICU వార్డులో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు శుక్రవారం మృత్యువాత పడ్డారు. ఐసీయూలో ఆక్సిజన్ అందకే పేషంట్లు చనిపోయారని.... వారందరినీ ఒకే వాహనంలో మహా ప్రస్థానం పంపారంటూ ఆరోపణలు వస్తున్నాయి.

ఇక ఆరుగురు మృతిపై వస్తున్న ఆరోపణలను ఖండించారు సూపరింటెండెంట్ సిద్దా నాయక్. చనిపోయిన వారంతా వివిధ సమయాల్లో చనిపోయారని.. తీవ్ర అనారోగ్యం కారణంగా మరణించారని చెబుతున్నారు. ఆక్సిజన్‌ లేదన్న వార్తలు అవాస్తవమన్నారు సూపరింటెండెంట్. హాస్పిటల్‌లో ఆక్సిజన్‌ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. చనిపోయిన వారంతా వేరు వేరు ప్రాంతాల వారైనప్పుడు.. అందరినీ ఒకే వాహనంలో పంపడం అసాధ్యమని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story